MS Dhoni | భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ మిస్టర్ కూల్.. తన విలువైన సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ లెజెండరీ క్రికెటర్ ఇటీవలే తన భార్య సాక్షి సింగ్ ధోనీ (Sakshi Singh Dhoni)తో కలిసి ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో గల తన పూర్వికుల ఇంటిని సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా తన క్లోజ్ ఫ్రెండ్స్, సహచర ఆటగాడు అయిన సురేశ్ రైనా (Suresh Raina)కు తన ఇంట్లో ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.
బుధవారం రాత్రి ధోనీ దంపతులు రైనాకు డిన్నర్ ఇచ్చారు. భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ( Pragyan Ojha )ను కూడా ఈ డిన్నర్కు ఆహ్వానించారు. మరోవైపు తమకు అద్భుతమైన విందు ఇచ్చినందుకు ధోనీ దంపతులకు రైనా, ప్రజ్ఞాన్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఫొటోలు కూడా షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ధోనీ పేరు ముందువరసలో ఉంటుంది. అతడి సారథ్యంలోనే భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2019 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే, 2020 ఆగస్టులో 42ఏళ్ల ఈ మిస్టర్ కూల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్కు దూరంగానే ఉంటున్నాడు. అయినప్పటికీ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. ధోనీకి కార్లు, బైక్స్ అంటే మహా పిచ్చి. సమయం దొరికనప్పుడల్లా రాంచీ వీధుల్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా రైడ్కు వెళ్తుంటాడు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాటిని చూసి అభిమానులు తెగ మురిసిపోతుంటారు.
Also Read..
Heavy Rains | కేరళ, తమిళనాడులో భారీ వర్షం.. పాఠశాలలకు సెలవు
Rain | హైదరాబాద్లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం