భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరో చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా వెనుతిరిగింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్తో తలపడిన సైనా.. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. వరుస సెట్లలో 11-21, 17-21 పాయింట్లతో ఓటమి చవిచూసింది. దీంతో మలేషియా ఓపెన్లో సైనా కథ ముగిసినట్లే.
అయితే మరో స్టార్ షట్లర్ పీవీ సింధు మాత్రం ఈ టోర్నీలో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో థాయిల్యాండ్కు చెందిన పోన్పావీ చోచువోంగ్పై సునాయాసంగా గెలిచిన సింధు.. రెండో రౌండ్లో అడుగుపెట్టింది. చోచువాంగ్తో జరిగిన మ్యాచ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె 21-13, 21-17 తేడాతో వరుస సెట్లు సాధించి మ్యాచ్ తన ఖాతాలో వేసుకుంది.