కౌలాలంపూర్: సీజన్ ఆరంభ టోర్నీ మలేషియా ఓపెన్లో భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్కు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ తొలి రోజు భారత్ నుంచి గాయత్రి గోపీచంద్-త్రిసా జాలి జంట మాత్రమే విజయం సాధించింది. మంగళవారం పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 19-21, 14-21తో కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో ఓడగా.. మహిళల సింగిల్స్లో సైనా 12-21, 21-17, 12-21తో హాన్ యూ (చైనా) చేతిలో పరాజయం పాలైంది.
మహిళల డబుల్స్లో గాయత్రి-త్రిసా జోడీ 21-19, 21-14తో యెంగ్ టింగ్-యెంగ్ లామ్ (హాంకాంగ్) జోడీపై విజయం సాధించింది.