బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. థామస్ కప్ను చేజిక్కించుకున్న ఉత్సాహంతో శ్రీకాంత్ అదే దూకుడు కనబర్చగా.. హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్ నిరాశపర్చారు.
మహిళల్లో సీనియర్ షట్లర్ సింధు ముందంజ వేయగా..సైనా నెహ్వాల్తోపాటు ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.