India Vs SA ODI | లక్నోలో సాగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నది. 23 ఓవర్లో రవి బిష్ణోయ్ వేసిన రెండో బంతిని ఆడబోయిన డికాక్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయారు. అప్పటికి జట్టు స్కోర్ 110 పరుగులు. అంతకుముందు దక్షిణాఫ్రికా 21 ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్నది. నాలుగో వికెట్ కాపాడేందుకు డికాక్, క్లాసిన్ ప్రయత్నించారు. 54 బంతుల్లో 48 పరుగులు చేసిన డికాక్.. అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
సగం ఓవర్లు పూర్తయ్యే సరికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత డికాక్.. క్రీజ్లో నిలకడగా ఆడుతున్నాడు. డికాక్ 40 పరుగులు, హెన్రిచ్ క్లాసిన్ 13 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. అంతకుముందు టీం ఇండియా బౌలర్ కుల్దీప్ 16వ ఓవర్లో వేసిన చివరి బంతిని ఆడిన మక్రాం బౌల్డ్ అయ్యాడు. అప్పటికి సఫారీల స్కోర్ 74 పరుగులు మాత్రమే. దీంతో దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది.
అంతకుముందు 15వ ఓవర్లో సఫారీలు రెండో వికెట్ కోల్పోయారు. 15వ ఓవర్లో చివరి బంతిని వేసిన ఠాకూర్.. క్రీజ్లో ఉన్న బావుమాను క్లీన్బౌల్డ్ చేశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 70 పరుగులు మాత్రమే. అంతకుముందు 13వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో ఠాకూర్ వేసిన తొలి బంతిని ఆడిన జన్నెమాన్ మలాన్ ఔటయ్యాడు. ఆ బంతిని శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో సఫారీలు తొలి వికెట్ను కోల్పోయారు. అప్పటికి జట్టు స్కోర్ 49 పరుగులు. అంతకుముందు టాస్ గెలుచుకున్న టీం ఇండియా బౌలింగ్ ఎంచుకున్నది.
ఇప్పటికే టీ-20 సిరీస్ను సొంతం చేసుకున్న టీం ఇండియా.. మరో సిరీస్పై కన్నేసింది. గురువారం తొలుత షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన వన్డే మ్యాచ్.. వరుణుడు అడ్డంకిగా మారడంతో వాయిదా పడుతూ వచ్చింది.
వర్షం నేపథ్యంలో వన్డే మ్యాచ్ను 40 ఓవర్లకు కుదిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా, టీం ఇండియాకు శిఖార్ ధావన్ సారధ్యం వహిస్తున్నాడు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ-20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లడంతో దక్షిణాఫ్రికాతో సిరీస్కు శిఖార్ ధావన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.