సోఫియా(బల్గేరియా): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో సచిన్, సాగర్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన పురుషుల 57కిలోల ప్రిక్వార్టర్స్లో సచిన్..ఫైజోవ్(ఉజ్బెకిస్థాన్)పై గెలిచాడు. మరోవైపు 92కిలోల బౌట్లో సాగర్..జాజెవిసిస్ జోనస్(లిత్వేనియా)పై గెలిచి ముందంజ వేశాడు.
మహిళల విభాగంలో అరుంధతి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.