అబుదాబి: స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన సఫారీలు చివరకు గెలిచారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో సఫారీ బౌలర్లు విజృంభించడంతో బంగ్లా జట్టు 84 పరుగులకే ఆలౌట్ అయింది. 85 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన సౌతాఫ్రికా కూడా తొలి ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కాసేపటికే ఫామ్లో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్ (0), డి కాక్ (16) కూడా అవుటవడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగుతుందనిపించింది. అయితే వాన్ డర్ డస్సెన్ (22) తో కలిసి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసిన కెప్టెన్ టెంబా బవుమా (31 నాటౌట్) జట్టును విజయం వైపు నడిపించాడు. జట్టు స్కోరు 80 పరుగుల వద్ద వాన్ డర్ డస్సెన్ కూడా అవుటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (5 నాటౌట్) ఫోర్తో జట్టుకు విజయాన్నందించాడు. ఈ క్రమంలో 13.3 ఓవర్లలోనే టార్గెట్ ఛేజ్ చేసిన సౌతాఫ్రికా మరో 39 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, నాసుమ్ అహ్మద్ 1, మెహదీ హసన్ 1 వికెట్ పడగొట్టారు.