హూస్టన్: మాజీ క్రికెటర్ శ్రీశాంత్, ఆల్రౌండర్ స్టువార్ట్ బిన్నీ.. ఈ ఏడాది జరగనున్న అమెరికా ప్రీమియర్ లీగ్(American Premier League) టీ20 టోర్నీలో ఆడనున్నారు. డిసెంబర్ 19 నుంచి 31వ తేదీ వరకు ఆ టోర్నీ జరగనున్నది. ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్లు ఇండియా జట్టు తరపున ఆడడం లేదు. అందుకే విదేశీ టోర్నీల్లో ఆడేందుకు వాళ్లకు అనుమతి ఇచ్చారు. హూస్టన్లోని మూసా క్రికెట్ స్టేడియంలో ఆ మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఐసీసీ ఈ లీగ్ను స్పాన్సర్ చేస్తోంది.
టోర్నీలో మొత్తం ఏడు జట్లు పోటీపడనున్నాయి. దాంట్లో 40 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉంటారు. అమెరికా, ఇండియా, పాకిస్థాన్, విండీస్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన ప్లేయర్లు ఆడనున్నారు. ప్రీమియం ఇండియన్స్ జట్టు తరపున శ్రీశాంత్, బిన్నీ ఆడనున్నారు. గత ఏడాది దేశీయ క్రికెట్కు శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.