రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశాజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమైన అతను.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కూడా నాలుగు పరుగలకే పెవిలియన్ చేరాడు.
డేవిడ్ విల్లే వేసిన బంతి స్వింగ్ అవుతుందని అంచనా వేసిన జైస్వాల్.. డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అతని అంచనా తప్పడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో రెండో ఓవర్లోనే రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాజస్థాన్ స్కోరు 6/1.