రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. వికెట్లేమీ కోల్పోకుండా పవర్ప్లే ముగించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చాహల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి కెప్టెన్ డుప్లెసిస్ (29) అవుటవగా.. ఆ తర్వాత నవదీప్ సైని ఓవర్లో అనూజ్ రావత్ (26) పెవిలియన్ చేరాడు.
సైని బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించిన రావత్.. దాని యాంగిల్ను అంచనా వేయడంలో విఫలమవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది. శాంసన్ దాన్ని చక్కగా అందుకోవడంతో రావత్ పెవిలియన్ చేరాడు.
చాహల్ వేసిన 9వ ఓవర్లో కోహ్లీ (5) రనౌట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాతి బంతికే డేవిడ్ విల్లే (0)ను చాహల్ బౌల్డ్ చేశాడు. దాంతో 9 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 62/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది.