హాఫ్ సెంచరీతో ముంబైని ఆదుకున్న సూర్యకుమార్ యాదవ్ (51) పెవిలియన్ చేరాడు. యుజ్వేంద్ర చాహల్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించిన అతను.. లాంగాన్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన రియాగ్ ఎటువంటి పొరపాటూ చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. దీంతో సూర్యకుమార్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. చాహల్ సంబరాల్లో మునిగిపోయాడు.
ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికే తిలక్ వర్మ (35) కూడా అవుటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా టైమింగ్ చేయకపోవడంతో లాంగాన్లో ఉన్న రియాన్ పరాగ్కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు తిలక్. ముంబై గెలవాలంటే ఇంకా 37 పరుగులు అవసరం ఉన్నాయి.