రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ (2) పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని స్వీప్ చేయడానికి రోహిత్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్క్వేర్ లెగ్ వైపు వెళ్లింది.
అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డారియల్ మిచెల్ సులభమైన క్యాచ్ అందుకోవడంతో రోహిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు ప్రసిద్ధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్ కూడా క్యాచ్ ఇచ్చాడు. కానీ ఎక్స్ట్రా కవర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ దాన్ని సరిగా అందుకోలేక జారవిడిచాడు. లేదంటే ఇషాన్ కూడా పెవిలియన్ చేరేవాడే.