రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బౌలర్లు సత్తా చాటారు. కనీసం 180 పరుగులు చేస్తుందని అనిపించిన రాజస్థాన్ జట్టును 158 పరుగులకే కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్రా, మెరెడిత్ ఇద్దరూ కూడా కట్టుదిట్టంగా బంతులు విసిరి ప్రత్యర్థి జట్టును తిప్పలు పెట్టారు. పిచ్ కూడా బౌలింగ్కు సహకరించడంతో బట్లర్ (67) కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు.
అయితే పదహారో ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన అతను.. అదే ఓవర్ ఆరో బంతికి సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాటర్లలో అశవ్ిన్ (9 బంతుల్లో 21) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదనే చెప్పాలి. దేవదత్ పడిక్కల్ (15), సంజూ శాంసన్ (16), డారియల్ మిచెల్ (17) పరుగులు మాత్రమే చేశారు.
రియాన్ పరాగ్ (3) నిరాశ పరచగా.. షిమ్రాన్ హెట్మెయర్ (14 బంతుల్లో 6 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెరెడిత్, హృతిక్ షోకీన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అరంగేల్ర ఆటగాడు కుమార్ కార్తికేయ, డానియల్ శామ్స్ కూడా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.