ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. నిదానంగా సాగుతున్న ఇన్నింగ్స్ జోరు పెంచే క్రమంలో డారియల్ మిచెల్ (17) అవుటయ్యాడు. శామ్స్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన బట్లర్ (67) కూడా అవుటయ్యాడు.
హృతిక్ షోకీన్ వేసిన ఓవర్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. రియాన్ పరాగ్ (3) కూడా నిరాశపరిచాడు. దీంతో రాజస్థాన్ జట్టు 130 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.