ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రాజస్థాన్ యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (15) పెవిలియన్ చేరాడు. హృతిక్ షోకీన్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని భారీ షాట్ ఆడేందుకు పడిక్కల్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో లాంగాఫ్ వైపు బంతిని స్లైస్ చేశాడు.
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న పొలార్డ్ దాన్ని కంఫర్టబుల్గా అందుకున్నాడు. దీంతో పడిక్కల్ మైదానం వీడాల్సి వచ్చింది. జట్టు స్కోరు 26 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.