ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తొలి విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టు.. పిచ్ బౌలర్లకు సహకరించడంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై జట్టుకు శుభారంభం దక్కలేదు.
కెప్టెన్ రోహిత్ (2) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్ (26) కూడా పవర్ ప్లేలో నే అవుటయ్యాడు. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ యాదవ్ (51), తిలక్ వర్మ (35) ఆ జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు.
అయితే పదిహేనో ఓవర్ చివరి బంతికి సూర్యకుమార్, పదహారో ఓవర్ తొలి బంతికి తిలక్ అవుటవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అప్పటికి కూడా కీరన్ పొలార్డ్ (10), టిమ్ డేవిడ్ (20 నాటౌట్) క్రీజులో ఉండటంతో ముంబై గెలుపు ఖాయంగా మారింది. అయితే చివరి ఓవర్ తొలి బంతికే పొలార్డ్ అవుటయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డానియల్ శామ్స్.. తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించాడు. దీంతో ముంబై జట్టు ఐదు వికెట్ల తేడాతో, మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.