లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఫామ్లో ఉన్న బట్లర్ (13) ఆరంభంలోనే అవుటవడంతో ఆ జట్టు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే హోల్డర్ బౌలింగ్లో కెప్టెన్ సంజూ శాంసన్ (13) అవుటయ్యాడు.
మరుసటి ఓవర్లోనే కృష్ణప్ప గౌతమ్ అద్భుతమైన బౌలింగ్తో రాసీ వాన్ డర్ డస్సెన్ (4), దేవదత్ పడిక్కల్ (29)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో మిగిలిపోయింది. ప్రస్తుతం పది ఓవరల్ు మగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 67 పరుగులతో ఉంది.