రాజస్థాన్ రాయల్స్తో జరుగుతన్న మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు రాణించారు. దాంతో ఆర్ఆర్ బ్యాటర్లు పూర్తిగా సత్తా చాటలేకపోయారు. సూపర్ ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (7)ను యువ బౌలర్ చేతన్ సకారియా మూడో ఓవర్లోనే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపు వికెట్ పడకుండా అశ్విన్ (50), జైస్వాల్ (19) జట్టును ఆదుకున్నారు. కానీ 9వ ఓవర్లో జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు.
ఇలాంటి సమయంలో అశ్విన్కు జత కలిసిన దేవదత్ పడిక్కల్ (48) చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరూ చూడచక్కని షాట్లతో అలరించాడు. అర్ధశతకం పూర్తయిన వెంటనే మిచెల్ మార్ష్ బౌలింగ్ల్ అశ్విన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ (6), రియాన్ పరాగ్ (9) నిరాశ పరిచారు. అంచనాలు పెట్టుకున్న రాసీ వాన్ డర్ డస్సెన్ (12 నాటౌట్) భారీ షాట్లు ఆడలేకపోయాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జీ, సకారియా, మిచెల్ మార్ష్ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.