ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్కు మరో ఎదురు దెబ్బ. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19) నిరాశ పరిచాడు. బట్లర్ (7) స్వల్ప స్కోరుకే అవుటవడంతో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత అతనిపై పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్ ధాటిగా ఆడటంతో జైస్వాల్కు నెమ్మదిగా ఆడే అవకాశం లభించింది.
దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. మిచెల్ మార్ష్ వేసిన 9వ ఓవర్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు. షార్ట్ బాల్ను పుల్ చేసే సమయంలో టైమింగ్ మిస్ అయిన జైస్వాల్.. రెండో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 54 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది.