రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురు దెబ్బ తగిలింది. పృథ్వీ షా లేకపోవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ (0) మరోసారి నిరాశ పరిచాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.
ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించిన భరత్ విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు వెళ్లింది. సంజూ శాంసన్ దాన్ని చక్కగా అందుకోవడంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఢిల్లీ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.