చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిలకడగా ఆడుతోంది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (2) మరోసారి విఫలమవగా.. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32 నాటౌట్) ధాటిగా ఆడుతున్నాడు. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ (13 నాటౌట్) మంచి సహకారం అందించాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది.