రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. జోస్ బట్లర్ (2), శాంసన్ (15) ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ (3) కూడా నిరాశ పరిచాడు. మొయీన్ అలీ వేసిన బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించిన పడిక్కల్.. బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. దాంతో ఆ బంతి బెయిల్స్ను కూల్చింది. దీంతో 76 పరుగుల వద్ద రాజస్థాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.