చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. పించ్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయర్ (6) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. సోలంకి వేసిన అంతకు ముందు బంతికే బౌండరీ బాదిన అతను.. తర్వాతి బంతికి కూడా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో గాల్లోకి లేచిన బంతిని లాంగాన్లో ఉన్న కాన్వే అందుకున్నాడు. దీంతో హెట్మెయర్ ఇన్నింగ్స్ ముగిసింది. 112 పరుగుల వద్ద రాజస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.