రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో అదిరే ఆరంభం లభించిన తర్వాత చెన్నై బ్యాటింగ్ కుదేలైంది. డెవాన్ కాన్వే (16), జగదీశన్ (1), రాయుడు (3) ముగ్గురూ విఫలమయ్యారు. దీంతో పవర్ప్లేలో మొయీన్ అలీ సృష్టించిన విధ్వంసం వృధా అయింది. పవర్ప్లే ముగిసిన తర్వాత మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో.. చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పింది.
11వ ఓవర్లో అంబటి రాయుడు అవుటయిన తర్వాత వచ్చిన ధోనీ.. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే పవర్ప్లే ముగిసిన తర్వాత ఒక్క బౌండరీ కూడా లేని ఆ జట్టు ఇన్నింగ్స్.. ఎడారిని తలపించింది. ఈ క్రమంలో పదిహేనో ఓవర్లో ధోనీ బౌండరీ కొట్టడంతో చెన్నై అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 4 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది.