Team India : వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ను చిత్తు చేసి సిరీస్ సమం చేసిన భారత జట్టు(Team India) మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. సిరీస్లో కీలకమైన ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా రాజ్కోట్ చేరుకుంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అక్కడి సయాజీ హోటల్(Sayaji Hotel)లో క్రికెటర్లకు బస ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఇదే హోటల్లో భారత ఆటగాళ్లు ఉండనున్నారు. దాంతో హోటల్ సిబ్బంది రాజుల కాలం నాటి అలంకరణతో గదులను చక్కగా ముస్తాబు చేశారు.
‘విదేశీ పర్యటనల్లో భారత జట్టు సభ్యులు వెస్టర్న్ థీమ్తో ఉన్న గదుల్లోనే ఉంటారు. కాబట్టి మేము వాళ్లకు కొత్తదనం ఉండేలా, మన సంస్కృతిని ప్రతిబింబించేలా రూమ్స్ను డెకరేట్ చేశాం’ అని హోటల్ డైరెక్టర్ ఉర్వేశ్ పురోహిత్ తెలిపాడు.
అంతేకాదండోయ్.. రోహిత్ సేనకు పసందైన విందు ఇవ్వాలని అక్కడి చెఫ్లు నోరూరించే గుజరాతీ వంటకాలు(Kathiyawadi cuisine) సిద్దం చేస్తున్నారు. ఫఫ్డా, జిలేబీ, ఖాఖ్రా, గథియా, థెప్లాలతో పాటు బ్రేక్ఫాస్ట్గా ఖమ్న్ వడ్డించనున్నారు. ఇవేకాకుండా కతియవాడి ప్రత్యేక భోజనం అయిన దహి టికారి, వఘెరెల రొట్లో(సజ్జలతో చేసిన రొట్టె)తో పాటు డిన్నర్లో కధీని సర్వ్ చేయనున్నారు.
నోరూరించే గుజరాతీ వంటకాలు
రాజ్కోట్ వేదికగా ఫిబ్రవరి 15న భారత్, ఇంగ్లండ్ల మధ్యమూడో టెస్టు జరుగనుంది. వైజాగ్ టెస్టు తర్వాత అబూదాబీకి వెళ్లిన బెన్ స్టోక్స్ సేన మరో రెండు రోజుల్లో భారత్కు రానుంది. కీలకమైన ఈ టెస్టులో విజయంపై ఇరుజట్లు కన్నేశాయి. అయితే.. ఇరుజట్లను గాయాలు వేధిస్తున్నాయి. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ మూడో టెస్టు ఆడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
🚨 NEWS 🚨#TeamIndia‘s Squad for final three Tests against England announced.
Details 🔽 #INDvENG | @IDFCFIRSTBankhttps://t.co/JPXnyD4WBK
— BCCI (@BCCI) February 10, 2024
తొలి రెండు టెస్టులక దూరమైన విరాట్ కోహ్లీ.. ఏకంగా సిరీస్ మొత్తం ఆడకపోవడం భారత్కు పెద్ద లోటే. అయితే.. కుర్రాళ్లు యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, రజత్ పాటిదార్లు అద్భుతంగా రాణిస్తూ సీనియర్ల స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. దాంతో, రోహిత్ సేన రాజ్కోట్ టెస్టులో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.