Virat Kohli | ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వచ్చేశాడు. వ్యక్తిగత కారణాలతో ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు దూరమైన కోహ్లీ..ఆదివారం లండన్ నుంచి ముంబైకి చేరుకున్నాడు. త్వరలో మొదలుకాబోతున్న ఐపీఎల్ సీజన్ కోసం స్వదేశానికి వచ్చిన విరాట్..ఆర్సీబీతో కలువనున్నాడు.
ఈ విషయాన్ని లీగ్ ప్రసారదారు స్టార్స్పోర్ట్స్ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. తన భార్య అనుష్క శర్మ బాబు(అకాయ్)కు జన్మనివ్వడంతో కోహ్లీ..జాతీయ జట్టు నుంచి విరామం తీసుకున్నాడు. గత 16 ఏండ్లుగా ఆర్సీబీ తరఫున కోహ్లీ.. ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఈ నెల 22న లీగ్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్తో ఆర్సీబీ తలపడుతుంది.