ముంబై : విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ .. బెంగుళూరు జట్టులో ఉండనున్నారు. ఐపీఎల్ టోర్నీల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున కోహ్లీ, మ్యాక్స్వెల్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే సీజన్ కోసం జరగనున్న ఆటగాళ్ల వేలానికి ముందు ఆయా జట్లు తమ జాబితాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 30వ తేదీలోగా 8 ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను నిలుపుకోవాలనుకుంటున్నాయో ఆ వివరాలను వెల్లడించాలి. అయితే కోహ్లీ, మ్యాక్స్వెల్ను తమతోనే ఉంచుకోవాలని బెంగుళూరు జట్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను రిటేన్ చేసుకోవడానికి ప్రతి జట్టుకు అవకాశం ఉంటుంది. తమ వద్దే నిలుపుకున్న వారిలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ఉండవచ్చు. రిటెన్షన్ విధానం ముగిసిన తర్వాత.. ఆటగాళ్ల వేలానికి ముందు.. కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్లు.. ముగ్గురేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఇద్దరు ఇండియన్లు, ఒక విదేశీ ప్లేయర్ ఉంటారు.