Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడోవన్డేలో అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు. సొంత గడ్డపై వన్డేల్లో 123 సిక్స్లు కొట్టి ధోనీతో సమానంగా నిలిచాడు. స్వదేశంలో 73 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 123 సిక్సర్లు కొట్టాడు. 116 ఇన్నింగ్స్ల్లో ధోనీ 123 సిక్సర్లు బాదాడు. కసున్ రజిత వేసన 10వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టడంతో రోహిత్ ఈ రికార్డు అందుకున్నాడు. మూడో వన్డేలో 42 పరుగులకు రోమిత్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్తో కలిసి తొలి వికెట్కు 95 రన్స్ జోడించాడు.
తిరువనంతపురంలో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు వన్డేల్లో గెలిచిని భారత్ ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రమైన ఈ వన్డేలో కూడా విజయం సాధించి 3-0తో సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉంది