Rohit Sharma | అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా గురువారం జరగనున్న తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే, మ్యాచ్ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మాటల యుద్ధం సహజమే. భారత్తో ఆట అనగానే ఆస్ట్రేలియా మీడియా కాస్త అతి చేస్తుంటుంది. ఈ సారి కూడా అదే చేసింది. మ్యాచ్ మొదలవకముందే.. ఆస్ట్రేలియా మీడియా, ఆ జట్టు సభ్యులు కొందరు నాగ్పూర్ పిచ్పై విమర్శలు చేశారు. ఆతిథ్య భారత జట్టు పిచ్ను తమకు అనుకూలంగా మార్చిందంటూ ఆరోపించారు.
ఆసీస్ ఆరోపణలపై తాజాగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. బుధవారం ప్రెస్మీట్ సందర్భంగా ఇందుకు సంబంధించిన అశంపై విలేకరులు రోహిత్ను ప్రశ్నించగా.. అదిరిపోయే సమాధానమిచ్చారు. పిచ్పై కాకుండా మ్యాచ్పై దృష్టి పెట్టాలని అన్నారు. ‘మీరు పిచ్పై కాకుండా క్రికెట్పై దృష్టి పెట్టండి. మ్యాచ్ ఆడే మొత్తం 22 మంది నాణ్యమైన ఆటగాళ్లే’ అని రోహిత్ సమాధానమిచ్చారు.