Rohit Sharma : పొట్టి ప్రపంచకప్ ముందు ఆఖరి టీ20 సిరీస్లో టీమిండియా(Team India) అదరగొట్టింది. అఫ్గనిస్థాన్ (Afghanistan)ను 3-0తో క్వీన్స్వీప్ చేసి సొంతగడ్డపై తమకు తిరుగులేదని మరోసారి చాటింది. ఈ సిరీస్లో దంచికొట్టిన శివం దూబే(Shivam Dube), రింకూ సింగ్(Rinku Singh), బంతితో మయా చేసిన రవి బిష్ణోయ్(Ravi Bishnoi)లు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపికకు గట్టిపోటీగా మారారు. దాంతో, మ్యాచ్ అనంతరం జియో సినిమాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).. టీ20 వరల్డ్ కప్ సెలెక్షన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను అందిర్నీ సంతోష పెట్టలేను కదా! అని అన్నాడు.
‘నేను ప్రతి ఒక్కరిని సంతోష పెట్టలేను. ఇన్ని రోజుల కెప్టెన్సీలో నేను నేర్చుకున్నది అదే. కేవలం 15 మందినే సంతోషపెట్టగలం. కానీ, అప్పుడుకూడా 11 మంది మాత్రమే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే..? మిగతా నలుగురు బెంచ్ మీదే ఉండాల్సి వస్తుంది. అయితే.. నా దృష్టంతా జట్టు లక్ష్యాన్ని చేరుకునేలా చేయడమే’ అని రోహిత్ తెలిపాడు. అంతేకాదు వరల్డ్ కప్ స్క్వాడ్ ఎంపిక గురించి కూడా హిట్మ్యాన్ మాట్లాడాడు.
#TeamIndia Captain @ImRo45 receives the trophy after a dramatic end to the #INDvAFG T20I series 👏👏
India win the T20I series 3⃣-0⃣@IDFCFIRSTBank pic.twitter.com/9LQ8y3TFOq
— BCCI (@BCCI) January 17, 2024
‘మేమింకా వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండే 15 మందిని ఖరారు చేయలేదు. అయితే.. 8-10 మంది ఆటగాళ్లు మా దృష్టిలో ఉన్నారు. అయితే.. పరిస్థితులకు తగ్గట్టు కాంబినేషన్స్ మారుస్తాం. వెస్టిండీస్లో పిచ్లు స్లోగా ఉంటాయి. అందుకు తగ్గట్టు జట్టును ఎంపిక చేస్తాం. కోచ్ రాహుల్ ద్రవిడ్ అయినా నేను అయినా స్ఫష్టతతో ఉండాలనుకుంటున్నాం. ఎందుకు ఎంపికయ్యారు? అద్భుతంగా రాణించినా కూడా ఎందుకు ఎంపిక కాలేదు? అనే విషయాల్ని ఆటగాళ్లకు చెప్తాం’ అని రోహిత్ వెల్లడించాడు.
రోహిత్ శర్మ
అఫ్గనిస్థాన్తో తొలి రెండు మ్యాచుల్లో డకౌట్గా నిరాశ పరిచిన హిట్మ్యాన్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రెచ్చిపోయాడు. టీ20ల్లో తనను మించిన మొనగాడు లేడంటూ రోహిత్ సెంచరీతో చెలరేగాడు. అఫ్గన్ బౌలర్లను ఉతికారేస్తూ పొట్టి ఫార్మాట్లో ఐదో శతకం సాధించాడు. ఛేదనలో అఫ్గన్ బ్యాటర్లు కూడా దంచడంతో మ్యాచ్ సూపర్ ఓవర్(Super Over)కు వెళ్లింది. ఆశ్చర్యంగా అది కూడా టై కావడంతో.. రెండో సూపర్ ఓవర్లో టీమిండియా గెలుపొందింది.
ఈసారి టీ20 వరల్డ్ కప్ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి మెగా టోర్నీ షురూ కానుంది. 11 ఏండ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది.