బాసెటెర్రి(వెస్టిండీస్): టీ20లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని మించిపోయాడు. టీ20లలో అత్యధిక సిక్సర్లు సాధించిన భారత కెప్టెన్గా రోహిత్ అవతరించాడు. వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో మంగళవారం మూడో మ్యాచ్లో రోహిత్.. అల్జరి జోసెఫ్ వేసిన రెండో ఓవర్లో సిక్సర్ కొట్టడం ద్వారా కోహ్లీని అధిగమించాడు. రెండో మ్యాచ్ వరకు 59 సిక్సర్లతో విరాట్తో సమంగా ఉన్న రోహిత్ మూడో మ్యాచ్లో మరో సిక్సర్ సాధించి అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత కెప్టెన్గా రికార్డులకెక్కాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని ఆడిన తరువాత రోహిత్ వెన్ను నొప్పితో రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో గెలిచిన ఇండియా సిరీస్లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, నాలుగో మ్యాచ్కు ఇంకా సమయం ఉన్నందున అప్పటికి కోలుకోగలనని విశ్వాసం వ్యక్తంచేశాడు.