Rohit Sharma : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్లో రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలోని భారత జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. తన మార్క్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్న రోహిత్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. విమానం లోంచి తీసిన ఫొటోను పోస్ట్ చేసి దానికి.. ‘ముంబై నీకు ఏమైంది’ అంటూ హిట్మ్యాన్ క్యాప్షన్ రాశాడు. ఆ ఫొటోలో కాలుష్యం కారణంగా ముంబై నగరం మసకగా కనిపిస్తోంది.
2019లో ఐదు సెంచరీలతో దుమ్మురేపిన రోహిత్.. ఈసారి కూడా అదే సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల జాబితాలో 398 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. లక్నోలో ఇంగ్లండ్పై టాపార్డర్ కుప్పకూలిన సమయంలో ఓపికగా ఆడిన రోహిత్.. 87 పరుగులతో జట్టును ఒడ్డునపడేశాడు.
సొంతగడ్డపై 12 ఏండ్ల తర్వాత జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో భారత జట్టుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. గట్టి పోటీ ఇస్తాయనుకున్న న్యూజిలాండ్, ఇంగ్లండ్లను సైతం రోహిత్ సేన మట్టికరిపించింది. ఈ మెగా టోర్నీలో వరుసగా ఆరో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే.. నవంబర్ 2న టీమ్ఇండియా వాంఖడే స్టేడియంలో
శ్రీలంకను ఢీకొట్టనుంది. ఆసియా కప్ ఫైనల్లో లంకను చిత్తు చేసిన భారత్ మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని చూస్తోంది. ఆ మ్యాచ్లో పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో చెలరేగడంతో లంక 50 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే.