ముంబై: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(Rohit Sharma) 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజ్లో నిలువలేకపోయాడు. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని ఆశించినా.. రోహిత్ తన వికెట్ను చేజార్చుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన టెస్టు సిరీస్లో పేలవంగా ఆడిన రోహిత్ ఇంకా ఆ లోటు నుంచి కోలుకోలేదు. తొలి ఇన్నింగ్స్లో 19 బంతుల్లో 3 రన్స్ మాత్రమే చేసి రోహిత్ ఔటయ్యాడు.
అయితే రెండో ఇన్నింగ్స్లో ఓ అర్థశతకాన్ని బాదుతాడేమో అని భావించినా.. ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. ఉమర్ నాజిర్ బౌలింగ్లో సిక్సర్.. నబీ, యుధ్విర్ బౌలింగ్లో కొన్ని బౌండరీలు సాధించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. దాదాపు దశాబ్ధ కాలం తర్వాత రోహిత్ .. దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నారు. నిజానికి రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లోనే రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
రోహిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ బౌలర్ నజీర్ డ్రాప్ చేశాడు. ఒక్క రన్ వద్ద డ్రాప్ చేసినా.. 11 బంతుల్లో రోహిత్ 21 రన్స్ చేశాడు. ఆ తర్వాత జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మధ్య మధ్యలో బంతి బీట్ అవుతూనే ఉన్నాడు. రోహిత్ ఇన్నింగ్స్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ముంబై తన రెండో ఇన్నింగ్స్లో 22 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 86 రన్స్ చేసింది.
Rohit Sharma Pull Shot After 100+ Days 🥺❤️!
pic.twitter.com/RwZQVy2yhD— 𝐉𝐨𝐝 𝐈𝐧𝐬𝐚𝐧𝐞 (@jod_insane) January 24, 2025