T20 World Cup : భారత్లో క్రికెట్ జ్వరం మళ్లీ మొదలైంది. నిరుడు మహిళల వన్డే ప్రపంచకప్ ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు పొట్టి ప్రపంచకప్ సందడి ఘనంగా షురూ అయింది. ముంబైలోని వాంఖడే స్టోడియం అభిమానులతో నిండిపోగా.. అందరి కరతాళధ్వనుల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ(Rohit Sharma), ఐసీసీ అధ్యక్షుడు జై షాలు ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ డ్రెస్, తెలుపు షూతో తళుక్కుమన్న రోహిత్ వరల్డ్కప్ ట్రోఫీతో మైదానంలోకి వచ్చాడు.
పదో సీజన్ టీ20 ప్రపంచకప్ పోటీలతో క్రీడాభిమానులు పులకించిపోతున్నారు. భారత జట్టు మ్యాచ్కు వేదికైన వాంఖడే స్టేడియం కిక్కిరిసిపోయింది. డ్రమ్స్ శివమణి తన స్టయిల్ ప్రదర్శనతో అభిమానులతో స్టెప్పులు వేయించారు. మరోవైపు నృత్యకారులు.. యువతీయువకుల బృందం లయబద్ధంగా, హుషారుగా డ్రమ్స్ వాయిస్తూ వరల్డ్కప్ జోష్ నింపారు. అనంతరం ప్రపంచకప్ అంబాసిడర్, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి వచ్చాడు. ఐసీసీ ఛైర్మన్ జై షాతో కలిసి ఎంట్రీ ఇచ్చిన హిట్మ్యాన్.. వరల్డ్కప్ ట్రోఫీని మైదానంలోకి తీసుకొస్తుంటే రోహిత్.. రోహిత్ నినాదాలతో స్టేడియం మార్మోగిపోయింది.
The walk of brand ambassador Rohit Sharma with T20 World Cup trophy at Wankhade.🥵🔥 pic.twitter.com/2myVajzMFs
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) February 7, 2026