Team India Vs Australia | ఆస్ట్రేలియాతో రాజ్కోట్లో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో 21వ ఓవర్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ పెవిలియన్ దారి పట్టాడు. 21 ఓవర్లో మ్యాక్స్ వెల్ వేసిన చివరి బంతిని రోహిత్ శర్మ స్ట్రయిట్గా బాదాడు. మ్యాక్స్ వెల్ సైతం మెరుపు వేగంతో ఒంటిచేత్తో వడిసిపట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు. అంతకుముందు నాలుగో బంతిని సిక్సర్ బాదాడు రోహిత్. రోహిత్ ఔటయ్యే సమయానికి 81 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. 21 ఓవర్ ముగిసే సరికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.
అంతకుముందు 31 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేశాడు. తొమ్మిదో ఓవర్ లో గ్రీన్ వేసిన మూడో బంతిని స్టార్క్ క్యాచ్ విడవడంతో రెండు పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. 13 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజ్లో టీం ఇండియా సారధి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు. అంతకుముందు 11 ఓవర్ లో మ్యాక్స్ వెల్ వేసిన ఐదో బంతిని లబుచాగ్నే క్యాచ్ పట్టడంతో ఓపెనర్ వాషింగ్టన్ సుందర్ (18) పరుగులతో ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ ఔట్ కావడంతో క్రీజ్ లోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 23 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 46 పరుగులతో హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.