రాంచీ: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) .. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండు పరుగులకే నిష్క్రమించాడు. ఇంగ్లండ్ ప్రధాన బౌలర్ అండర్సన్ బౌలింగ్లో అతను కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గుడ్ లెన్త్ బాల్ను సరైన రీతిలో రోహిత్ ఆడలేకపోయాడు. ఎడ్జ్ తీసుకున్న ఆ బంతి నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లింది. స్వింగ్తో రోహిత్ను టెంప్ట్ చేసిన అండర్సన్ టెస్టుల్లో తన పర్ఫార్మెన్స్ మరింత పెంచేసుకున్నాడు. 697వ టెస్టు వికెట్ను అండర్సన్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇవాళ ఉదయం ఇంగ్లండ్ 353 రన్స్కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇండియా 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 రన్స్ చేసింది. జైస్వాల్ 16 రన్స్ చేసి క్రీజ్లో ఉన్నాడు.