రాయ్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో.. టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త తడబడ్డాడు. మతిమరుపుకు లోనైనట్లు కనిపించాడు. ప్రజెంటర్ రవిశాస్త్రి టాస్ కోసం పిలుపు ఇవ్వగా.. రోహిత్ తన వద్ద ఉన్న కాయిన్ను టాస్ వేశాడు. హెడ్స్ అని కాల్ వచ్చింది. అయితే టాస్ గెలిచిన రోహిత్.. తన నిర్ణయాన్ని చెప్పేందుకు వెనుకాడాడు. టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని మరిచిపోయానంటూ రోహిత్ కాసేపు అలాగే నిలబడిపోయాడు. మరో వైపు ప్రజెంటర్ రవిశాస్త్రి, కివీస్ కెప్టన్ టామ్ లాథమ్, రెఫరీ జవగల్ శ్రీనాథ్ కూడా రోహిత్నే చూస్తూ ఉండిపోయారు. మతిమరుపు నుంచి తేరుకున్న రోహిత్.. తొలుత బౌలింగ్ చేయనున్నట్లు చెప్పాడు. ఆ ఫన్నీ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
A funny moment from Rohit during toss time!!!pic.twitter.com/iWXCLLBmlB
— Johns. (@CricCrazyJohns) January 21, 2023