చెన్నై : ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా అతనికి ఆ ఫైన్ వేశారు. చెన్నైలో నిన్న రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేసింది. ముంబై జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేయడం వల్ల కెప్టెన్ రోహిత్కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం 12 లక్షల జరిమానా వేసినట్లు ఆ ప్రకటనలో వెల్లడించారు. నిన్నటి మ్యాచ్లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 137 రన్స్ చేసింది. ఆ తర్వాత ఆ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు చివరి ఓవర్లో అందుకున్నది.