సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కొంచెం తడబడినా ఆ తర్వాత కుదురుకున్నట్లే కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (43) హాఫ్ సెంచరీ పూర్తిచేసుకోకుండానే పెవిలియన్ చేరాడు. కేశవ్ మహారాజ్ వేసిన 10వ ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్.. డీప్ మిడ్వికెట్లో స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు.
కేశవ్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో రోహిత్ మిడిల్ చేయలేకపోయాడు. దీంతోనే బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ధాటిగా ఆడుతున్నాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 96/1 స్కోరుతో నిలిచింది.
🙌🏏 WELL PLAYED! The skipper departed after giving us a dream start.
📸 BCCI • #RohitSharma #INDvSA #SAvIND #INDvsSA #TeamIndia #BharatArmy pic.twitter.com/wxXTDKd9bi
— The Bharat Army (@thebharatarmy) October 2, 2022