హైదరాబాద్, ఆట ప్రతినిధి: విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చత్తీస్గఢ్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్.. ఓపెనర్ రోహిత్ రాయుడు(102) సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో 271/9 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (49) ఆకట్టుకున్నాడు. జివేశ్ (3/41), శాశంక్సింగ్(3/69) మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చత్తీస్గఢ్ 48.1 ఓవర్లలో 273/4 స్కోరు చేసింది. రిషబ్ తివారీ (65), సంజీత్ దేశాయ్(47) జట్టు విజయంలో కీలకమయ్యారు. కార్తీకేయ(2/35) రెండు వికెట్లు తీశాడు. హైదరాబాద్ ఓటమితో రోహిత్ సెంచరీ వృథా అయ్యింది.