వెస్టిండీస్తో రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్లో భారీ లక్ష్య ఛేదనలో 205/5తో నిలిచిన జట్టును యువ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో వన్డేల్లో తొలి అర్ధశతకం నమోదు చేశాడు.
చివరి మూడు బంతుల్లో ఆరు పరుగులు కావలసి ఉండగా.. తను ఎదుర్కొన్న మరుసటి బంతికే భారీ సిక్సర్ బాది జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో అక్షర్ ఇన్నింగ్స్పై మాజీ క్రికెటర్లు, సీనియర్లు ప్రశంసల వర్షం కురిపించారు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అక్షర్ను, టీమిండియాను కొనియాడాడు. టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసిందన్న రోహిత్.. అక్షర్ ఇన్నింగ్స్ను కూడా మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం నెట్టింట ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. తన మెరుపు ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అక్షర్.. 17 సంవత్సరాల పాటు ధోనీ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి, ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు ధోనీ (మూడు సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉండేది. అక్షర్ తన ఇన్నింగ్స్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది ఈ రికార్డు తన పేరిట రాసుకున్నాడు.
Woah 🤯 that was some performance from team India last night. Bapu badhu Saru che @akshar2026 @bcci
— Rohit Sharma (@ImRo45) July 25, 2022