నాగపూర్: రోహిత్ శర్మ క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో అతను ఔట్ అయ్యాడు. నాగపూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రోహిత్.. టీ విరామం తర్వాత తొలి ఓవర్లోనే ఔట్ అయ్యాడు. కొత్త బంతి తీసుకున్న కమ్మిన్స్కు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి వరకు టాప్ ఫామ్లో ఉన్న రోహిత్ .. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిష్క్రమించాడు. బంతి ఆఫ్ స్టంప్స్కు తగలగా.. ఆ వికెట్ చాలా దూరం ఎగిరిపడింది. రోహిత్ 212 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 120 రన్స్ చేశాడు.
Captain @ImRo45 departs a fine knock of 120.#TeamIndia 229/6, lead by 52 runs.
Live – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/fd73FrTz9U
— BCCI (@BCCI) February 10, 2023
ఇక ఆసీస్ అరంగేట్ర బౌలర్ టాడ్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. స్పిన్కు అనుకూలిస్తున్న నాగపూర్ పిచ్ను అతను సరిగ్గా వాడుకున్నాడు. శ్రీకర్ భరత్ను ఔట్ చేసిన మర్ఫి .. తొలి టెస్టులోనే అయిదు వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలిచాడు.
Todd Murphy has 5 on debut!#INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 10, 2023
తాజా సమాచారం మేరకు ఇండియా 86 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 246 రన్స్ చేసింది. జడేజా 42, అక్షర్ 1 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.