కొలంబో: భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్లో సిక్స్ కొట్టడం ద్వారా ఆ రికార్డు రోహిత్ సొంతమైంది. ఆసియాకప్-2023లో భాగంగా ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరుగుతున్నది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తున్నది.
యువ బ్యాటర్ శుభ్మాన్ గిల్తో కలిసి కెప్టెన్ రోహిత్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్ను రోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. వరుసగా తొలి ఐదు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని రోహిత్ ఆరో బంతిని అమాంతం బౌండరీ లైన్ అవతలికి తరలించాడు. అంతే.. ఒక అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో సిక్సర్ కొట్టిన తొలి క్రికెటర్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. ఇంతవరకూ మరే క్రికెటర్ కూడా షాహీన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్లో సిక్సర్ కొట్టలేదు.