Deodhar Trophy 2023 : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో చెత్త ఆటతో విమర్శల పాలైన రియాన్ పరాగ్(Riyan Parag) దేశవాళీ లీగ్లో అదరగొడుతున్నాడు. పుదుచ్చేరి వేదికగా జరుగుతున్నదేవ్ధర్ ట్రోఫీ(Deodhar Trophy 2023)లో వెస్ట్ జోన్(West Zone)తో జరిగిన కీలకమైన సెమీ ఫైనల్లో పరాగ్ సెంచరీ చెలరేగాడు. మణిశంకర్ మురాసింగ్(Manisankar Murasingh) ఐదు వికెట్లతో సత్తా చాటడంతో ఈస్ట్ జోన్(East Zone) జట్టు 157 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దాంతో, ఫైనల్కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో సౌత్ జోన్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్కు ముందు ఈస్ట్, వెస్ట్ జోన్ జట్లకు 12 పాయింట్లు ఉన్నాయి. అందుని ఇరుజట్లు ఈ మ్యాచ్ను సీరియస్గా తీసుకున్నాయి.
రియాన్ పరాగ్ 102 నాటౌట్ 68బంతుల్లో శతకంతో విజృంభించాడు. కీపర్ కుష్గర(53)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దాంతో, ఈస్ట్ జట్టు 319 కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో వెస్ట్కు మంచి ఆరంభం లభించినా సద్వినియోగం చేసుకోలేదు. టాప్ – 3 ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్(38), ఉత్కర్ష్ సింగ్(50), విరాట్ సింగ్(42) ధనాధన్ ఆడారు. కానీ, మణిశంకర్ మురాసింగ్ బంతితో మాయ చేసి వెస్ట్ జట్టును దెబ్బకొట్టాడు.