ప్రపంచ క్రికెట్లో డ్యాషింగ్ ఓపెనర్ అనే పేరుకు పూర్తి న్యాయం చేసిన వారిలో భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తన ధనాధన్ బ్యాటింగ్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సెహ్వాగ్.. రిటైర్ అయిన తర్వాత తన చమత్కారం, సూటి కామెంట్స్తో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా భారత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గురించి అతను కీలక వ్యాఖ్యలు చేశాడు.
రిషభ్ పంత్ గనుక కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడితే.. అతన్ని ఎవరూ గుర్తుంచుకోరని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ‘‘టెస్టు క్రికెటే అసలైన క్రికెట్. అది ఆడకపోతే పంత్ను ఎవరూ గుర్తుంచుకోరు. కోహ్లీకి ఈ విషయం తెలుసు. అందుకే అతను ఎక్కువగా టెస్టులకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. 100-150 టెస్టు మ్యాచులు ఆడితే అతను చరిత్రలో నిలిచిపోతాడు. అందుకే టెస్టు క్రికెట్కు అతను అంత ప్రాధ్యానం ఇస్తాడు’’ అని సెహ్వాగ్ వివరించాడు.