IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్(IPL) 17వ సీజన్కు ముందు అభిమానులకు గుడ్న్యూస్. గాయం కారణంగా ఈ ఏడాది పలు టోర్నీలకు దూరమైన స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) 2024 ఎడిషన్ కోసం సిద్ధమవుతున్నాడు. 15వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కెప్టెన్గా వ్యవహరించిన పంత్.. మళ్లీ ఢిల్లీ సారథిగా మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
ఈ డాషింగ్ హిట్టర్ ఐపీఎల్ రీ-ఎంట్రీపై గతంలోనే హింట్ ఇచ్చిన ఢిల్లీ మేనేజ్మెంట్ తాజాగా 17వ సీజన్లో పంత్ బరిలోకి దిగుతాడని స్పష్టం చేసింది. కానీ, భారత జట్టుకు కీలకమైన పంత్ ఆరోగ్యంపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)లో ఫిట్నెస్ మెరుగుపర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో 17వ సీజన్లో పంత్ ఫీల్డింగ్ చేసేందుకు బీసీసీఐ ఓకే చెప్పకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఢిల్లీ మేనేజ్మెంట్ ఏం అన్నదంటే..?
రిషభ్ పంత్
‘పంత్ వికెట్ కీపింగ్ చేయడానికి బీసీసీఐ అనుమతించకుంటే అతడు బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు. ఫీల్డర్గా మైదానంలో ఉండి జట్టును నడిపిస్తాడు’ అని ఫ్రాంచైజీ అధికారు ఒకరు తెలిపారు. 2024 ఎడిషన్లో పంత్ ఢిల్లీ సారథిగా ఆడతాడని మెంటార్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
పంత్ సారథ్యంలో 2020లో ఫైనల్ చేరిన ఢిల్లీ టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. 16వ సీజన్కు ముంందు కారు యాక్సిడెంట్లో పంత్ గాయపడడంతో ఢిల్లీ క్యాపిటల్స్కు డేవిడ్ వార్నర్(David Warner) నేతృత్వం వహించాడు.
డేవిడ్ వార్నర్