కొంతకాలంగా భారత యువసంచలనం, వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ రిషభ్ పంత్.. టీ20 క్రికెట్లో తడబడుతున్నాడు. షాట్ల ఎంపిక, తత్తరపాటు అతని బ్యాటింగ్లో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతని బ్యాటింగ్లో సమస్య ఏంటనే ప్రశ్న అభిమానులను పట్టిపీడిస్తోంది. దీనికి కివీస్ మాజీ సారధి డానియల్ వెట్టోరీ సమాధానం ఇచ్చాడు.
‘టీ20 క్రికెట్లో పంత్ తన టెంపో సరిగా పట్టుకోలేకపోతున్నాడు. తన పాత్ర ఏంటో కూడా పంత్కు అర్థం కాలేదు. ముఖ్యంగా ఈ సిరీస్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఆడుతుంటే, కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యంగా ఆడాడు. అతని ఆటలో ఒక ఫ్లో కనిపించలేదు’ అని వెట్టోరీ వివరించాడు.
టీ20 క్రికెట్లో గొప్ప ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే వాళ్ల ఆటలో ఒక ఫ్లో, మొమెంటం ఉంటాయని అతను విశ్లేషించాడు. ఈ అంశంలో పంత్ చాలా వెనుకబడి ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. జట్టు మేనేజ్మెంట్ ఈ విషయంలో పంత్తో మాట్లాడాలని వెట్టోరీ సూచించాడు. ఒక బ్యాట్స్మెన్గా అతని నుంచి జట్టు ఏం ఆశిస్తుందో పంత్కు అర్థమయ్యేలా చెప్పాలన్నాడు.
‘జట్టు మేనేజ్మెంట్ మాట్లాడుతుందో లేదో చెప్పలేను. కానీ ఇక్కడ తాను చేయాల్సిందేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత పంత్పైనే ఉంది. లేదంటే అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ఇషాన్ కిషన్ ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేస్తాడు. ఇలా ప్రత్యామ్నాయాలు తెలుసుకాబట్టి, పంత్ తన రిథమ్ తెలుసుకోవడానికి మరిన్ని అవకాశాలు ఇస్తారు’ అని వెట్టోరీ విశ్లేషించాడు.