Rishabh Pant | క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తున్న సమయంలో పంత్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ తలకు తీవ్ర గాయమైంది.
అయితే పంత్ ఆరోగ్యంపై తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వివరాలను వెల్లడించింది. రిషబ్ బ్రెయిన్, వెన్నెముకకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారని, బ్రెయిన్, వెన్నెముక సాధారణంగా ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పంత్కు డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, పంత్ నుదురు చిట్లిందని, వీపుపై కాలిన గాయాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతోపాటు కుడి మోకాలి లిగ్మెంట్ కదిలినట్లు ఎక్స్రేల్లో తేలినట్లు వెల్లడించింది. దీనికి శనివారం శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు.
రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న మెర్సిడీజ్ కారు.. ఉత్తరాఖండ్లోని రూర్కీ వద్ద రోడ్డుప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. హరిద్వార్ జిల్లాలోని మంగలౌరు వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి.