ముంబై : లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఘోర వైఫల్యం తర్వాత ఆ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తప్పుకున్నాడు. ఈ సీజన్లో లక్నో ఆఖరి, పదో స్థానంలో నిలవడంతో పంత్ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలన్న పంత్ అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించిందని ఎల్ఎస్జీ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. కాగా, ఈ టోర్నీలో కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. అతను ఆడిన 14 ఇన్నింగ్స్ల్లో కేవలం 312 పరుగులు మాత్రమే సాధించాడు.