లండన్: కరోనా బారిన పడిన ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నాడు. అతనికి సోమవారం కొవిడ్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్ నెగటివ్గా తేలితే.. అతడు టీమ్ బయోబబుల్తో చేరుతాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మూడు వారాల బ్రేక్ దొరకడంతో బబుల్ నుంచి బయటకు వచ్చిన పంత్కు ఈ నెల 8న కరోనా సోకింది. మరోవైపు మంగళవారం నుంచి కౌంటీ లెవన్తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్లో పంత్ స్థానంలో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరో కీపర్ సాహా కూడా ఐసోలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. ఇక శుభ్మన్ గిల్ కూడా గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్కు దూరం కావడంతో రోహిత్ శర్మతో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు.